ఛారిటీ
మతపరమైన కార్యకలాపాలతో పాటు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని వివిధ గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు మద్దతుగా, సిద్ధగురు వివిధ సామాజిక కార్యకలాపాలను నిర్వహిస్తారు.
20వేల పుస్తకాల ఉచిత పంపిణీ
సరైన జ్ఞానాన్ని పంచడం కూడా సామజిక సేవయే అని సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి నిశ్చిత అభిప్రాయం. ఆధ్యాత్మిక పుస్తకాలు సానుకూల జ్ఞానాన్ని అందిస్తాయి. ఈ పుస్తకాలను చదవడం సానుకూల మనసుకు, సానుకూల సమాజానికి దారితీస్తుంది. మహర్షి వారి ఆధ్వర్యంలో వారి భక్తులు నిర్మల్ జిల్లాలోని 100 గ్రామాల్లో 20000 పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. పంపిణి చేసిన ఆధ్యాత్మిక పుస్తకం పేరు 'శివుడే దేవాది దేవుడు ఆది దేవుడు పరమ పురుషుడు'
దివ్యాంగుల కొరకు ప్రత్యేక సేవలు
సిద్ధగురు 10 జనవరి 2014 న విశాఖపట్నంలో దివ్యాంగులకు (శారీరక వికలాంగులకు) ట్రైసైకిల్స్ మరియు లెగ్ సపోర్టులను పంపిణీ చేశారు. దివ్యాంగులు సిద్ధగురు 25 ట్రైసైకిల్స్ మరియు 2 లెగ్ సపోర్టులను దివ్యా0గులకు విరాళంగా ఇచ్చారు.
బ్లడ్ డొనేషన్ క్యాంపు, హైదరాబాద్
సిద్ధగురు రెడ్క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. భక్తులు పాల్గొని, స్వచ్ఛందంగా రక్తాన్ని అవసరమైన వారికి దానం చేశారు.