సిద్ధగురు ప్రవచనములు
సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు 2002 వ సంవత్సరంలో నిష్కామ జ్ఞానదాన సేవ కు శ్రీకారం చుట్టారు. మొట్టమొదటగా శిరిడి సాయిబాబా జీవితము మీద అనుగ్రహ భాషణం ఇచ్చారు. ఆనాటి నుండి యావత్ భారతదేశం, అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో పర్యటించి శిరిడి సాయి బాబా సమగ్ర జీవితాన్ని, బోధలను, మార్గదర్శకత్వాన్ని తెలియజేసారు. అనేక సిద్ధగురువుల జీవితాలను మరియు వారి బోధలను, ఆత్మసాక్షాత్కార స్వీయ అనుభూతులను, కుండలినీ శక్తి ఇంకా మనో నియంత్రణపై ప్రవచనాలు ఇచ్చారు. వారి ప్రవచనాల ద్వారా లోకానికి తెలియని ఎన్నో ఆధ్యాత్మిక నిగూడ తత్వ రహస్యాలను బహిర్గతం చేశారు.
-
భగవాన్ శ్రీ రమణ మహర్షి వారు 108 ద్విపద పద్యాలతో పరమ శివుడిని ఆరాధించిన గ్రంథమే అరుణాచల అక్షరమణ మాల. శ్రీ రమణానంద మహర్షి వారు అరుణాచల అక్షరమణమాల లోని ఒక్కొక్క పద్యాన్ని వ్యాఖ్యానంతో ప్రవచించారు.
Jun 2, 2020
-
సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు శిరిడిసాయి శతాబ్ది ఉత్సవాలను అక్టోబర్ -2017 నుండి సెప్టెంబర్-2018 నిర్వహించి, శిరిడిసాయినాథుని వైభవాన్ని, ఆయన మేటి శిష్యుడైన ఉపాసనీబాబా గురించి ప్రవచించారు.
Jun 2, 2020
-
శ్రీ సూక్తంలో స్తుతింపబడిన పరమదైవము, జాతవేదః శబ్ద వాచ్యుడు సర్వ ద్రష్ట అయిన, సర్వజ్ఞుడైన పరమశివుడే అని పరిశోధనాత్మకంగా వివరించిన శ్రీ రమణానంద మహర్షి వారు
Jun 2, 2020
-
నాలుగు వేదాలు (ఋగ్వేదము, సామ వేదము, యజుర్వేదము, అధర్వ వేదము) పరమశివుడే దేవదేవుడని, పరమపురుషుడని, పరాత్పర దైవమని వివరించడం జరిగింది.
Jun 2, 2020
-
వేదానుసారం గణపతి అంటే విశ్వంలో సర్వ గణాలకు అధిపతి. గణపతి జననం లేని నామ రూప, గుణ రహిత పరంజ్యోతి. సర్వజీవుల హృదయాలలో అంతర్యామి అయిన సాక్షాత్తు పరమశివుడు
Jun 2, 2020
-
నాలుగు వేదాలలో ఒకటైన శుక్ల యజుర్వేదంలోని చివరి అధ్యాయమైన 40వ అధ్యయము ఈశావాస్యోపనిషత్. వాస్తవముగా ఈశావాస్యోపనిషత్ ఉపనిషత్ కాదు మూల వేదం.
Jun 2, 2020
-
శ్రీ రమణానంద మహర్షి వారు 2016 విజయ దశమి సందర్భంగా దేవీ కాలోత్తరం గురించి ప్రవచించడం జరిగింది.
Jun 2, 2020
-
రాధాకృష్ణమాయి శిరిడిసాయి బాబాతో జన్మజన్మల సంబంధం కలిగి ఉన్న భక్తురాలు. శిరిడిసాయి కోసం తన జీవితాన్నే నివేదించిన భక్తురాలు, సృజనాత్మకమైన ఎన్నో సేవలకు (సాయి ఆరతి, కృష్ణాష్టమి, సాయి సంస్థాన్) రూపకల్పన చేసిన భక్తురాలు.
Jun 2, 2020